వరి నట్లు వేశాక రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వరిలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులలో ఒక ముఖ్యమైన పని వరిలో బాటలు తీయడం. వరిలో ఈ బాటలు ఏ సమయంలో ఏ విధంగా తీయాలి? వాటివల్ల కలిగే ప్రయోజనలేమిటి? అనే సందేహాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇస్తున్న సమాధానాలను రైతు సోదరుల కొరకు అందిస్తున్నాం.
వరి నాటు నాటిన 10-15 రోజులలోపు బాటలు తీయడం మంచిది. ఇంతకన్నా ముడుగానే బాటలు తీస్తే మొక్కలు లేచిపోవటం జరుగుతుంది. 10-15 రోజుల తర్వాతే మొక్కలు గట్టిగ ఉండి తెగిపోయే అవకాశం ఉంది. మడిలో నీటి మట్టం 3-5 సెంటి మీటర్లు ఉన్నప్పుడే బాటలు తీయాలి. బాటలు తీసేందుకు మడి పొడవును బట్టి తాడు పొడవును నిర్ణయించాలి. తాడు పెన్సిల్ మందం ఉండే విధంగా చూసుకోవాలి. తాడు ఎక్కువ లవయిన బిరుసుదనం రాదు. సంనమైతే తెగే అవకాశముంది. తాడును మడికి ఆ గట్టున ఒకరు ఈ గట్టున ఒకరు పట్టుకొని లాగి చివరలు పుల్లకు కట్టి ప్రతి రెండు మీటర్లకు 20 సెంటి మీటర్లు కాలి బాటను తీయాలి. దీనివల్ల బాటల మధ్యలో కోత సమయంలో 3 నుండి 4 ఓదుల సమన పనలుగా పది త్వరగా ఎండిపోయే అవకాశముంది. ముఖ్యంగా బాటలను మడికి గాలివాటంగా తీయాలి. దీనివల్ల మడిలో గాలి ఎక్కువ ప్రవేశిస్తుంది.
వరిలో బాటలు తీయడంవల్ల ప్రయోజనాలు:
మంచి గాలి, వాతావరణానికి: వరి చేలో బాటలు తీయడం వల్ల ఎక్కువ గాలి వరి పైరులోకి ప్రవేశించి దుబ్బులకు అధిక ఆక్సిజన్ను అందిస్తుంది. దీనివల్ల మొక్కలలో కిరానా జన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్కలు పచ్చధనంతో నిండి అధిక దిగుబడులిచ్చే అవకాశాలున్నాయి. వరి ఎక్కువ దుబ్బు కట్టడానికి అవకాశముంది.
ఎరువులు చల్లేందుకు: వరి బీటలు తీయకుండా వంకర తిన్కరాగా మదిలో నడిచి ఎరువు వేసేటప్పుడు మొక్కల్ని తొక్కడం, ఎరువును సరిగ్గా వేయకపోవడం వంటి నష్టాలు ఉన్నాయి. బాటలు తీసి బాటలో నడుస్తూ ఎరువులు చల్లటం వల్ల చేలో అన్ని దుబ్బులకు సమానంగా పడతామేగాక ఎరువు ఆదా అవుతుంది.
See also: paddy, alleyways, alley, ways, improved production technology of paddy, latest improved techniques, vari lo yajamanya padhathulu, nutana yajamanya padhatulu, high yielding in rice, rice,
See also: paddy, alleyways, alley, ways, improved production technology of paddy, latest improved techniques, vari lo yajamanya padhathulu, nutana yajamanya padhatulu, high yielding in rice, rice,
Comments
Post a Comment