Skip to main content

వరిలో బాటలు తీయడం వల్ల ప్రయోజనాలు (Benefits by formation of Alley ways in Paddy)

    వరి నట్లు వేశాక రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  వరిలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులలో ఒక ముఖ్యమైన పని వరిలో బాటలు తీయడం.  వరిలో ఈ బాటలు ఏ సమయంలో ఏ విధంగా తీయాలి?  వాటివల్ల కలిగే ప్రయోజనలేమిటి? అనే సందేహాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇస్తున్న సమాధానాలను రైతు సోదరుల కొరకు అందిస్తున్నాం.
    వరి నాటు నాటిన 10-15 రోజులలోపు బాటలు తీయడం మంచిది.  ఇంతకన్నా ముడుగానే బాటలు తీస్తే మొక్కలు లేచిపోవటం జరుగుతుంది.  10-15 రోజుల తర్వాతే మొక్కలు గట్టిగ ఉండి తెగిపోయే అవకాశం ఉంది.  మడిలో నీటి మట్టం 3-5 సెంటి మీటర్లు ఉన్నప్పుడే బాటలు తీయాలి.  బాటలు తీసేందుకు మడి పొడవును బట్టి తాడు పొడవును నిర్ణయించాలి.  తాడు పెన్సిల్ మందం ఉండే విధంగా చూసుకోవాలి.  తాడు ఎక్కువ లవయిన బిరుసుదనం రాదు.  సంనమైతే తెగే అవకాశముంది.  తాడును మడికి ఆ గట్టున ఒకరు ఈ గట్టున ఒకరు పట్టుకొని లాగి చివరలు పుల్లకు కట్టి ప్రతి రెండు మీటర్లకు 20 సెంటి మీటర్లు కాలి బాటను తీయాలి.  దీనివల్ల బాటల మధ్యలో కోత సమయంలో 3 నుండి 4 ఓదుల సమన పనలుగా పది త్వరగా ఎండిపోయే అవకాశముంది.  ముఖ్యంగా బాటలను మడికి గాలివాటంగా తీయాలి.  దీనివల్ల మడిలో గాలి ఎక్కువ ప్రవేశిస్తుంది.




వరిలో బాటలు తీయడంవల్ల ప్రయోజనాలు:

మంచి గాలి, వాతావరణానికి: వరి చేలో బాటలు తీయడం వల్ల ఎక్కువ గాలి వరి పైరులోకి ప్రవేశించి దుబ్బులకు అధిక ఆక్సిజన్ను అందిస్తుంది.  దీనివల్ల మొక్కలలో కిరానా జన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్కలు పచ్చధనంతో నిండి అధిక దిగుబడులిచ్చే అవకాశాలున్నాయి.  వరి ఎక్కువ దుబ్బు కట్టడానికి అవకాశముంది. 

ఎరువులు చల్లేందుకు: వరి బీటలు తీయకుండా వంకర తిన్కరాగా మదిలో నడిచి ఎరువు వేసేటప్పుడు మొక్కల్ని తొక్కడం, ఎరువును సరిగ్గా వేయకపోవడం వంటి నష్టాలు ఉన్నాయి.  బాటలు తీసి బాటలో నడుస్తూ ఎరువులు చల్లటం వల్ల చేలో అన్ని దుబ్బులకు సమానంగా పడతామేగాక ఎరువు ఆదా అవుతుంది.


See also: paddy, alleyways, alley, ways, improved production technology of paddy, latest improved techniques, vari lo yajamanya padhathulu, nutana yajamanya padhatulu, high yielding in rice, rice,

Comments

Popular posts from this blog

మలబారు వేప (Malabaru Vepa/ Neem) సాగు, పెట్టుబడి, లాభ నష్టాల వివరాలు

మలబారు వేప చెట్టును తెలుగు వ్యవహారిక భాషలో "కొండ వేప" అని కూడా అంటారు.  రైతులు ఈ చెట్లను మల్బరీ వ్యాప్ (Mulbari Vyap/ Malbary Wap) అని అంటున్నారు.  ఈ మద్య కాలంలో అభ్యుదయ రైతులు , యువ రైతులు మలబారు వేప సాగు పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు.   మలబారు వేప ఎలాంటి ఆదునిక సాంకేతిక పద్ధతులు (టిష్యూ కల్చర్పా , క్లాతింగ్) పాటించకుండానే అతి తక్కువ సమయంలో బాగా పెరుగుతుంది. మలబారు వేప (కొండ వేప) సాగు విధానం మరియు దిగుబడి వివరాలు: మలబారు వేప (కొండ వేప) విత్తనాలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి , విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.  మలబారు వేప (కొండ వేప) పెంచుటకు మొక్కల మద్య దూరం 4' X 4' గా విత్తుకోవాలి, ఈ నిష్పత్తిలో సాగు చేసినచో 2800  మలబారు వేప   మొక్కలను   ఒక ఎకరం భూమి లో పెంచవచ్చును.   2 సంవత్సరముల తర్వాత దిగుబడి 50 టన్నులు గా నమోదు కావొచ్చును. మొక్కల మద్య దూరం 8’ X 8’ విత్తుకున్నట్లయితే ఎకరానికి 700ల మొక్కలు సాగు చేసుకోవొచ్చు.  7 సంవత్సరముల తర్వాత దిగుబడి 700 టన్నులు గా నమోదు కావొచ్చును. మలబారు వేప (కొండ వేప) మార్కెట్ రేట్: ప్రస్తుత మార్కెట్ వ

Value Addition to Rice: వరితో విలువాధారిత పదార్థాల తయారి

     వరి ధాన్యం నుండి బియ్యం, నూక, తవుడు, ఊక ఉప పదార్థాలు వస్తాయి.  వరి ధాన్యం నుండి బియ్యం, తక్కువ పోటాష్ వేసిన బియ్యం, ఉప్పుడు బియ్యం, ఉప్పుడు రవ్వ (ఇడ్లి రవ్వ)ను తాయారు చేయవచ్చును.  తవుడు నుండి రైస్ బ్రాన్ ఆయిల్ ను తీస్తారు.      వరి ధాన్యం నుండి మరమరాలు (బొంగు పేలాలు), అటుకులు తాయారు చేయవచ్చును. వరి మరియు ఇతర ఉప పదార్థాలలో ఉన్న పోషక విలువలు (100 గ్రా.లలో): 1. బియ్యం (గ్రా.): మాంస క్రుత్తులు: 6.9, క్రొవ్వు: 0.4, కాల్షియం: 0.01, ఇనుము: 1.0 మీ.గ్రా., శక్తి: 3.47 కి.కే., 2. ఉప్పుడు బియ్యం (గ్రా.): మాంస క్రుత్తులు: 6.4, క్రొవ్వు: 0.4, కాల్షియం: 0.01, ఇనుము: 2.2 మీ.గ్రా., శక్తి: 3.45 కి.కే. 3. అటుకులు (గ్రా.): మాంస క్రుత్తులు: 6.6, క్రొవ్వు: 0.2, కాల్షియం: 0.02, ఇనుము: 8.0 మీ.గ్రా., శక్తి: 3.47 కి.కే. 4. మరమరాలు (గ్రా.): మాంస క్రుత్తులు: 7.5, క్రొవ్వు: 0.1, కాల్షియం: 0.02, ఇనుము: 6.2 మీ.గ్రా., శక్తి: 3.27 కి.కే.     మహిళలు, యువ రైతులు వారితో రకరకాల ఆహార పదార్థాల తయారిని చిన్న కుటీర పరిశ్రమ గా చేసుకొని స్వయం ఉపాధి పొందవచ్చును.      దంపుడు బియ్యం, పోటాష్ తక్కువ చేసిన బియ్యం, ఉప్ప